హంద్రీనీవా విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల వద్ద ఎస్ఎల్ఆర్బీ శ్లాబ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. సాధారణంగా మూడు రోజులు పడే ఈ పనిని భూమ్ ప్రెజర్ పంపుతో కేవలం ఆరు గంటల్లోనే పూర్తి చేయడం విశేషం. ఈ విజయాన్ని తెలిసిన సీఈ నాగరాజు, ఎస్ఈ రాజాస్వరూప్ అక్కడికి వచ్చి సిబ్బందిని అభినందించారు.