అనంతపురం జిల్లా ఉరవకొండలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లిన ముగ్గురు చిన్నారులు గీజర్లో వేడి నీటిని బకెట్లోకి పోస్తుండగా ఆవిరి విపరీతంగా ఏర్పడి బాత్రూం అంతటా వ్యాపించింది. దీంతో వారు ఊపిరాడక ముగ్గురూ అక్కడే మూర్చిపోయి కిందపడిపోయి, అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.