సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఉరవకొండ వడ్డెర సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. పట్టణంలో మంగళవారం అంబటి చిత్రపటాలను దహనం చేశారు. రాజకీయ ఉనికి కోసం నోరు పారేసుకున్న అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు సంజీవరాయుడు, లాల్స్వామి, శివరుద్ర పాల్గొన్నారు.