ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలు, నాయకుల నుంచి వివిధ రకాల ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.