కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలోని చెరువులో మంగళవారం ఐదుగురు చిన్నారులు గల్లంతు అయ్యారు. గల్లంతైన ఐదుగురు చిన్నారుల మృతదేహాల కోసం పోలీసులు, గ్రామస్థులు, గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మోటార్ల సాయంతో చెరువులో నీటిని తోడారు. రాత్రి 11 గంటల సమయంలో పిల్లల మృతదేహాలను గుర్తించారు. మృతులు తరుణ్ యాదవ్, పార్ధు, హర్షవర్ధన్, చరణ్గా గుర్తించారు.