ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి చెప్పారు. ఆదివారం దేవగుడిలో ఆయన స్వగృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎర్రగుంట్ల, మైలవరం మండలాల నుంచి ప్రజలు విచ్చేసి వినతిపత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైంది కావున గ్రామాల్లో పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించామన్నారు.