వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి అనుచరుడు, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు నమోదైంది. రవీందర్ రెడ్డిపై పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. ప్రభుత్వ పెద్దలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారంట్పై వర్ర రవీందర్ రెడ్డిని బాపట్లకు పోలీసులు తీసుకువస్తున్నారు. కడప జైలు నుంచి బాపట్ల జిల్లా కోర్టుకు వర్రాను తరలిస్తున్నారు.