కడప నిమ్స్ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగర కమిటీ ఆధ్వర్యంలో వారు రిమ్స్ను సందర్శించారు. ఆసుపత్రిలో మంచినీటి ట్యాంకులు వాడకానికి నోచుకోక పోవడం, రోగులు నీళ్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్నారు.