కడపలో శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు నేతృత్వం వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జీవో 77 రద్దు చేయాలని నినాదాలు చేశారు.