రెండు రోడ్డు ప్రమాదాలపై కేసులు నమోదు

రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలపై ఆదివారం కేసులు నమోదు చేసినట్లు మదనపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. ఆరోగ్యవరం దగ్గర ఆటో బైకును ఢీకొన్న సంఘటనలో బాధితుడు రమణ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఫిర్యాదు చేయగా ఆటో డ్రైవర్ నవీన్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పుంగనూరు రోడ్డు బసిని గంగమ్మ గుడి వద్ద మోటారు బైకులు ఢీకొన్న సంఘటనలో చలపతి పై కేసు నమోదు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్