శుక్రవారం, బి. కొత్తకోట మండలం గోళ్లపల్లెకు చెందిన పుణ్యవతి (40) కుటుంబ సమస్యలతో పురుగు మందు తాగారు. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే మండలం గట్టు పంచాయతీ ఇర్రివారిపల్లెకు చెందిన యువతి (20) చెవిలోని బంగారు కమ్మ పోగొట్టుకుంది. కుటుంబ సభ్యులు మందలించడంతో గన్నేరు చెక్క తిని అస్వస్థతకు గురైంది. ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.