నిమ్మనపల్లి: దంపతులపై కత్తులతో దాడి

మదనపల్లి నియోజకవర్గం, నిమ్మనపల్లి మండలంలోని బండ్లపల్లి వద్ద దంపతులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో భార్యా భర్తలు తీవ్రంగా గాయపడగా, వారిని 108 ద్వారా హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యాయత్నానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎస్సై తిప్పేస్వామి, సిఐ సత్యనారాయణ ఘటన స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్