బుధవారం సాయంత్రం నిమ్మనపల్లి మండలంలో కుటుంబ సమస్యలతో రైతు రమణ (55) గన్నేరు పప్పు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.