వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ కమిషనర్ ప్రతిషాపుకు వెళ్లి ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గాంధీ రోడ్డులోని ఒక మద్యం షాపును సందర్శించి, అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్ల వాడకంపై షాపు యజమానులకు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని మానేస్తామని షాపు నిర్వాహకులు కమిషనర్కు హామీ ఇచ్చారు.