అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయాలి

అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాముడు పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ అమెనిటీస్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెగా లేఔట్లో జరుగుతున్న హౌసింగ్ నిర్మాణాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ రమణారెడ్డి, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్