అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

చక్రాయపేట మండలం సిద్దారెడ్డిగారి పల్లి చెక్ పోస్టు వద్ద శుక్రవారం కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి 89 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్