చిట్వేల్ మండలం మిట్టపల్లి గ్రామంలో కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్సై వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, రానున్న ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.