కురబలకోట మండలం దిగువపాలెంలో ఆస్తి తగాదాల కారణంగా అన్నదమ్ములు శంకర, నరసింహులుపై అదే గ్రామానికి చెందిన రెడ్డప్ప, రమేశ్ కర్రలతో దాడి చేశారు. గత కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తుండగా, సోమవారం రాత్రి తలెత్తిన ఘర్షణ మంగళవారం ఉదయం దాడికి దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు పోలీసులను ఆశ్రయించి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.