అన్నమ్మయ్య జిల్లాలో ఆదివారం హార్సిలీహిల్స్ టీడీపీ సమీక్షా సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. ఈ సమావేశం నుంచి ఇన్చార్జి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, పార్టీ అబ్జర్వర్ దీపక్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. తంబల్లపల్లె ఇన్చార్జి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు గొడవపడ్డారు. గొడవను సర్ది చెప్పలేక మంత్రులు సమావేశం నుంచి వెళ్లిపోయారు.