AP: రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ 56కిలోమీటర్ల మేర రూ.2047 కోట్లతో కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ను నీతి ఆయోగ్ ఆమోదించిందన్నారు. మరిన్ని అనుమతుల కోసం సమయం పడుతుందన్నారు. కాగా ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య నిర్మించే ఈ లైన్లో 9 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మిస్తారు. కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణా నదిపై 3కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు.