మహిళల కోసం మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు 'గృహిణి' పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పథకం ద్వారా కాపు మహిళలకు ఒక్కసారిగా రూ.15 వేలు అందించాలని ప్రతిపాదించారు. ఈ పథకం కోసం సుమారు రూ.400 కోట్లు అవసరమని అంచనా వేశారు. త్వరలోనే ఈ పథకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్