ఏపీ అసెంబ్లీ పనిదినాలను 8 రోజులకు కుదించారు. దీంతో ఈనెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని తొలుత బీఏసీ సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. కానీ, తాజాగా 8 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చించేందుకు టీడీపీ 18 అంశాలను, బీజేపీ 9 అంశాలను ప్రతిపాదించింది.