AP: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఫిబ్రవరి 3వ తేదీన కేబినెట్ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో పాటు కీలక విషయాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ నెల 28న మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేబినెట్ భేటీ నిర్వహిస్తుండడం విశేషం.