ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు ఏపీ శాసన మండలి ఏకగ్రీవ ఆమోదం

AP: ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు ఏపీ శాసన మండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. రాజీవ్‌రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జిల్లాల వారిగా జనగణన చేసిన తరువాత ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుదామని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే బుడగజంగం వారిని ఎస్సీ ఏ గ్రూపులో కలపాలని ఏకగ్రీవంగా శాసన సభ ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్