కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాల పై రాష్ట్ర హక్కులను కాపాడాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ రాశారు. రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీ నికర జలాల్లో ఒక్క టీఎంసీ కోల్పోయే పరిస్థితి తలెత్తినా, దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిలో 763 టీఎంసీ నీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తుందని, ఇది ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.