AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. మంగళవారం మార్నింగ్ వాక్కు వెళ్లిన వైసీపీ నేత ఓబుళరెడ్డిపై జేసీ వర్గీయులు దాడి చేశారు. కాపుకాసి దాడి చేసి ముళ్లకంపలో పడేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయపడిన ఓబుళరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.