AP: మంగళగిరిలో జరుగుతున్న టీడీపీ ‘మహానాడు’ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పొలిట్బ్యూరో సభ్యుడు ఎం.ఎ. షరీఫ్తో పాటు పార్టీకి చెందిన ముస్లిం నేతలను ప్రత్యేకంగా అభినందించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కూడా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.