AP: నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. పద్మభూషణ్ అవార్డు రావడం తనలో కసిని పెంచిందన్నారు. తనకెవరూ ఛాలెంజ్ కాదని హాట్ కామెంట్స్ చేశారు. తనకు పద్మభూషణ్ రావడం కన్నా.. నాన్న ఎన్టీఆర్కు భారతరత్న రావటమే ముఖ్యమని బాలకృష్ణ అన్నారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా చేశారని, వైసీపీతో విసిగిపోయి ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారన్నారు.