దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.4 కోట్లతో నిర్మించిన అద్దంకి బీటీ రోడ్డును ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇంటింటికీ తిరిగి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. జగన్ కుట్రలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంక్షేమ పాలనకి, విధ్వంస పాలనకి తేడా గుర్తించాలన్నారు.