సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయమే మేలు

కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ ధనరాజ్ పాల్గొని మాట్లాడారు. రైతులందరూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేయడం ద్వారా లాభాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. అతిగా పురుగు మందులు వాడటం వలన భూమిలో పోషకాలు దెబ్బతింటాయని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ హరిబాబు, ఏవో శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్