ప్రభుత్వ భూములను పరిశీలించిన ఆర్డీవో

పట్టణంలోని మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే నెంబర్ 19లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు ఆర్డీవో దృష్టికి తీసుకు వెళ్లిన నేపథ్యంలో మంగళవారం ఆర్డీవో ఆక్రమణకు గురైన భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు రోడ్డు వేయడాన్ని హేబేలు ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ భూములు అన్యాకృతం కాకుండా పరిరక్షించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్