బాపట్ల జిల్లా, పొన్నూరు నియోజకవర్గం, చందోలు గ్రామంలోని శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు తో కలిసి శనివారం సందర్శించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్శనలో ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.