చిలకలూరిపేటలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల వద్ద లారీని ఢీకొని వ్యక్తి సోమవారం మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఒంగోలుకు చెందిన షేక్ అబ్దుల్లా(45) షేక్ సాఫాను 2వ వివాహం చేసుకొని మద్దిరాలలో ఉంటున్నాడు. బైక్పై వెళుతున్న వ్యక్తిని చిలకలూరిపేట వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో హాస్పిటల్కి తీసుకువెళ్లగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అనిల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్