యడ్లపాడు మండలం పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ తమ ఎదురు వాహనాన్ని తప్పించబోయి కంటైనర్కు ఢీకొంది. దీంతో బైక్ పూర్తిగా దగ్ధం కాగా, యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న బిటెక్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.