గుంటూరులోని ముత్యాలరెడ్డి నగర్లో నెల్లూరుకు చెందిన అశోక్ కుమార్ రెడ్డి (29) అనే యువకుడు మద్యం మత్తులో 3వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. బంధువుల ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.