ప్రభుత్వ సొమ్ముతో కుట్టుమిషన్లను కొని పసుపు రంగు వేసి అందిస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జనం సొమ్మును కాజేయాలనే ఆలోచన తమకు లేదని, తాను ఎమ్మెల్యేగా లేని సమయంలో కూడా మంగళగిరి ప్రజలకు స్వయం ఉపాధికి ఆర్థిక సాయంతో చేయూతనందించానని, అందంతా తన సొంత నిధులతో చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇకనైన ఫేక్ ప్రచారాలు మానుకో అంటూ జగన్పై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మండిపడ్డారు.