కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మోసం కేసులో నిందితుడు కొసరాజు నాగేశ్వరరావుకు కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. కేసవరం పాడుకు చెందిన ఫిర్యాదుదారు బత్తిన శ్రీనివాసరావు వద్ద మిర్చి కొనుగోలు చేసి రూ.19 లక్షలు చెల్లించకుండా మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. 2021న నమోదైన ఈ కేసులో పర్చూరు కోర్టు ఈ తీర్పు వెలువరించింది.