సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు వద్ద హైవేలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నుంచి వస్తున్న లారీ, ముందు వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.