శ్రీశ్రీరేణుకామాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న అంబటి

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ రేణుకా మాత పోతురాజు స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సోమవారం జరిగింది. కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గo సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామసర్పంచ్ యానాదిరావు, మాజీ సర్పంచ్ పిచ్చి రెడ్డి, అక్కి రెడ్డి, మోహన్ రావు, భక్తులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్