చేబ్రోలు: విద్యుత్ ఘాతకానికి కౌలు రైతు మృతి.. ప్రాణాపాయ స్థితిలో భార్య

చేబ్రోలు మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు కూచిపూడి ఆంజనేయులు (43) భార్య రాజమ్మ పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో తమలపాకు తోటను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఆదివారం రోజువారిగా తోటలో పని ముగించుకొని వస్తుండగా తోటలోని షెడ్డు వద్ద విద్యుత్ షాక్ తగిలి ఆంజనేయులు మృతి చెందాడు. భార్యకు కూడా షాక్ తగలడం తో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్