నూజెండ్ల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కూలీలతో వెళ్తున్న ఆటోను, బైక్ ఢీకొట్టిన ఘటన నూజెండ్ల మండలం కొత్త ఉప్పలపాడు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్ నడిపే వ్యక్తి కొత్తపాలెంకి చెందిన వెంకటరెడ్డి (62) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టర్ నిమిత్తం వినుకొండ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్