ఈపూరు మండలం అగ్నిగుండాలకు చెందిన రైతు మద్దిరాల పిచ్చయ్య(32) విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందాడు. వరి నారుకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన విద్యుత్ సరఫరా లేకపోవడంతో కరెంట్ స్తంభం ఎక్కగా, ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ రావడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.