రాష్ట్రంలో బుధవారం నుంచి నాలుగు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ముఖ్యంగా పోలవరం (D) చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని, అలాగే విజయనగరం (D) బాడంగి, తెర్లాం, వంగర, మన్యం (D) గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, సీతానగరం మండలాల్లో కూడా వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.