AP: కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లజర్లకు చెందిన నక్కసాయి (21), జాన్స్ మార్ట్ రాజమహేంద్రవరంలోని సాయి ఫిజియోథెరపీ కళాశాలలో మూడో ఏడాది చదువుతున్నారు. బైకుపై ఇంటికి వెళ్తున్న సాయి వ్యాన్ను వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతిచెందగా, జాన్స్ ను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.