ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు

AP: ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏ మాత్రం మారలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్‌ గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించడం, ఏపీలో కూడా తమకు అనుమానాలున్నాయని ఓడిపోయిన పార్టీ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రజలు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారన్నారు. దాన్ని వైసీపీ హుందాగా స్వీకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్