పల్నాడు జిల్లాలో పడవ ప్రమాదం తప్పింది. వేదాద్రి నుంచి గింజిపల్లికి ప్రయాణికులతో వెళ్తున్న బోటు ఇంజిన్ మొరాయించడంతో నది మధ్యలో ఆగిపోయింది. బోటు నిర్వాహకులు తెడ్ల సహాయంతో ప్రయాణికులను అవతలి ఒడ్డుకు తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.