AP: బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ చిన్నాను వైసీపీ అధినేత జగన్ పరామర్శించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని, జగన్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని చిన్నా తెలిపారు. జగన్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. గతంలోనూ జగన్ ప్రభుత్వం బోటు ప్రమాద బాధితులను ఆదుకుందని చిన్నా గుర్తుచేశారు.