AP: సీఎం చంద్రబాబును ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబుకు బోండా ఉమా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రాధాన్యమైన అంశమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంని కోరినట్లు బోండా ఉమా తెలిపారు.