AP: నంద్యాల జిల్లాలోని డోన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఆచారి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.