AP: రాష్ట్రంలో 2.04 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏజెన్సీల ద్వారా కూడా కొనుగోలు చేయించేందుకు ప్రయోగాత్మక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమలో పండిన అరటిని ముంబయి, కోల్కతా వంటి ప్రాంతాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించి, విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి, మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసినట్లు వివరించారు.